![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:38 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం జరిగిన దశమ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభయాంజనేయ స్వామి దయతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, దేవాలయం వద్ద నూతనంగా నిర్మించనున్న కమాన్ పనులకు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.