![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:05 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల మార్కింగ్ ప్రక్రియను ఆమె సమీక్షించారు. పనులు నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్న విషయంపై వివరంగా ఆరా తీశారు.
లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను పరిశీలించిన అనంతరం, త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆమె ఆదేశించారు. ప్రాజెక్టు విజయవంతంగా పూర్తవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీలో ఆమెతో పాటు ఎంపీడీవో కమలాకర్, పంచాయితీ కార్యదర్శి బాల్ రామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.