![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:05 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ నివాసంలో ఆమె సమావేశమయ్యారు. సుమారు గంట పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులు, క్యాబినెట్ విస్తరణ, పీసీసీ కమిటీల నియామకంపై వీరు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.