![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:04 PM
నార్నూర్ మండలంలోని ఎంపల్లి గోండుగూడలో శుక్రవారం గిరిజన సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం ఆదివాసీలు విజంగ్ మోహుతుర్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు, ఆడపడుచులు కలిసి రైతుల పంట కోసం వర్షాలు సమృద్ధిగా కురావాలని మోహతుర్ పూజలు చేశారు. అనంతరం నృత్యాలు చేశారు. కార్యక్రమంలో పెందోర్ అమృతరావు, జ్యోతిరామ్, ఆనందరావు, జంబీరావు, జలపాత తదితరులున్నారు.