![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 04:19 PM
ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నవేగావ్ గ్రామస్తులు తమ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని కొందరు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఆర్డీఓ లోకేశ్వరరావును కలిసి తమ సమస్యను వివరించారు. జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ సహకారంతో గ్రామస్తులు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
గత కొంతకాలంగా ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని కొందరు వ్యక్తులు, "మీరు ఉంటున్న గ్రామం మా పట్టాలో ఉంది, మా భూమిని మాకు అప్పగించాలి" అంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నారని, లేకపోతే జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆర్డీఓ ముందు వాపోయారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.