![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:42 PM
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురుస్తోంది. మహబూబ్ నగర్, వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అనేక కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. నైరుతీ రుతుపవనాలు క్రమంగా, జోరుగా భారత్ వైపు వస్తున్నాయి. వచ్చే 5 రోజులపాటూ.. ఇవి కేరళవైపు వచ్చేందుకు అనుకూల వాతావరణం ఉంది అని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుదం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీవుల దగ్గర నైరుతీ రుతుపవనాలు ఉన్నాయి. కర్ణాటక తీరంలో ఒక తుపాను ఉంది. దీని వల్ల అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పక్కన ఏర్పడిన అల్పపీడనం వల్ల సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకూ మేఘాలు ఉన్నాయి.