![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 12:37 PM
బంజారాహిల్స్లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటికి డ్రాప్ చేస్తానని నమ్మించి ఓ యువకుడు తనకు సమీప బంధువైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే, 17 ఏళ్ల బాలిక ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈ నెల 19న ఆమె తన సోదరితో కలిసి బయటకు వచ్చింది. అయితే సోదరి వేరే పనిమీద వెళ్లిపోవడంతో బాలిక ఒంటరిగా ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆమెకు సమీప బంధువైన నవీన్ అనే యువకుడు బైక్పై వచ్చి, ఇంటి వద్ద డ్రాప్ చేస్తానంటూ ఆమెను బైక్పై ఎక్కించాడు.
అయితే ఇంటికి తీసుకెళ్లాలని చెప్పిన నవీన్, ఆమెను తన నివాసానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు పాక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.