![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 15, 2025, 03:44 PM
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆర్య వైశ్య సంఘం రామచంద్రపురం ఆధ్వర్యంలో జరిగిన రాజ గోపుర కలశ యంత్ర ప్రతిష్ఠ శ్రీ పరమేశ్వరి ఆజ్ఞతో అంగర వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రతిష్టనిత్యచార్ణలు అంగ హోమాలు నిత్య హోమాలు అన్న సమారాధన మొదలైన కార్యక్రమాలు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన పాలం కి కామేశ్వర శర్మ పురోహితులు మరియు ఆలయ అర్చకులు లక్ష్మణ కుమార్ శర్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు జయ ప్రకాష్ గారు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణ గారు, సత్యనారాయణ, బచ్చు కృష్ణ గారు, ప్రభాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.