అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 11:29 AM
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన రమాదేవి, బాలకృష్ణ దంపతుల ముగ్గురు పిల్లలు వసుధ, వర్షిత, అంకిత్లకు తలసీమియా వ్యాధి సోకింది. 15 ఏళ్ల కిందట వసుధకు, ఆరేళ్ల కిందట అంకిత్కు ఈ వ్యాధి నిర్ధారణ అయింది. వీరి చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.16 లక్షలు ఖర్చు చేయడంతో పాటు, 3.07 ఎకరాల పొలాన్ని అమ్ముకున్నారు. హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 15 రోజులకు ఒకసారి రక్తమార్పిడి చేయిస్తున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకు ఒక్కొక్కరికి రూ.40 లక్షలు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.