|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 04:12 PM
భానుడి ప్రతాపం కారణంగా రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే రాబోయే రెండు మూడు రోజుల్లో మరో 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు ఐఎండీ అధికారులు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు.