|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 04:00 PM
చెరుకుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురు ఉన్న చెరువు అభివృద్ధి పనులకు నియోజకవర్గం తెదేపా నాయకుడు అనగాని శివప్రసాద్ బుధవారం అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. రూ. 50 లక్షల నిధులతో చెరువు సుందరీకరణ, వాకింగ్ టాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో, టీడీపీ మండల అధ్యక్షులు తాతా ఏడుకొండలు, టౌన్ అధ్యక్షులు శొంఠి సుబ్బారావు, మల్లాది రామకృష్ణ, మొహమాటం రాధాకృష్ణతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.