|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 10:27 AM
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై 'వాహన్' పోర్టల్ ద్వారా వాహనం కొనుగోలు చేసిన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో సుమారు 1,000 మంది డీలర్లకు శిక్షణ అందించారు. ఇప్పటికే 671 మంది డీలర్లు రిజిస్ట్రేషన్కు అనుమతి పొందగా, దాదాపు 33,000 తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. శనివారం నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ కూడా ప్రారంభం కానుంది. దీంతో వాహనదారులు ఇక ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సౌకర్యవంతంగా సేవలు పొందగలరు.