|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:19 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ‘జాగృతి జనం బాట’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ నెల 25వ తేదీ నుంచి ‘జాగృతి జనం బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కవిత వెల్లడించారు. ఈ కార్యక్రమం సుమారు నాలుగు నెలల పాటు కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే, కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆమె పేర్కొన్నారు.ఆదివారం ఉదయం తన భర్త అనిల్తో కలిసి తిరుమల చేరుకున్న కవిత, వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న కవిత దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.