|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 03:11 PM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెండున్నర నెలలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. తిరుమల దేవుని గుట్ట, వీరన్న పేట ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఈ చిరుత, ఇళ్ల సమీపంలోకి కూడా రావడంతో ఆందోళనలు పెరిగాయి. డ్రోన్ నిఘా కూడా విఫలమైన నేపథ్యంలో, అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.