![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:48 AM
బాలీవుడ్ మోస్ట్ అవైడెట్ పాన్ ఇండియా ఫిల్మ్ వార్ -2. హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ నుండి హై-ప్రొఫైల్ స్పై యూనివర్స్లో వస్తున్న ఈ ఆరో చిత్రం స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న కానుంది. వీకెండ్ ను క్యాష్ చేసుకునేందుకు ఇది సిద్ధమవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ఈ మూవీ తెలుగు రైట్స్ పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. 2019లో ఘన విజయం సాధించిన 'వార్' కు సీక్వెల్ గా వస్తున్న 'వార్ -2' లో ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇదే సినిమాతో హృతిక్ రోషన్ టాలీవుడ్ మార్కెట్లో భారీ విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. బడా ప్రొడక్షన్ హౌసెస్ థియేట్రికల్ హక్కులను పొందేందుకు యశ్ రాజ్ ఫిలిమ్స్ ను సంప్రదించినట్లు సమాచారం. అయితే తెలుగు కొనుగోలుదారులకు యశ్ రాజ్ ఫిలిమ్స్ నో చెప్పిందట. రెండు తెలుగు రాష్ట్రలంతటా కూడా ఈ సినిమాను సొంతంగా విడుదల చేయాలని నిర్ణయించుకుందట. నార్త్ సౌత్ తో పాటు ఓవర్సీస్ లో కూడా ఇదే ఫార్మూలాను యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
Latest News