![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:48 AM
శ్రీకాంత్, ఊహ తనయుడు రోషన్ నటించిన 'నిర్మల కాన్వెంట్' తో తెరంగేట్రమ్ చేసిన సుమ, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ 'బబుల్ గమ్' సినిమాతో హీరోగా మారాడు. ఇప్పుడు మరోసారి 'మోగ్లీ 2025' మూవీలో హీరోగా నటిస్తున్నాడు. 'బబుల్ గమ్'లో లవర్ బాయ్ గా నటించి ఆకట్టుకున్న రోషన్ ఇప్పుడీ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చేస్తున్నాడు. తాజాగా 15 రోజుల పాటు ఈ సినిమా భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ ను దర్శకుడు, 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ పూర్తి చేశాడు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ విశేషాలను సందీప్ రాజ్ చెబుతూ, 'తాజా షెడ్యూల్ ను మారేడుమిల్లిలో చేశాడు. ఇదో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ను పెర్ఫార్మ్ చేశాడు. ఈ సీన్స్ మూవీకి హైలైట్ గా ఉండబోతున్నాయి. మరో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. ఇదే నెలలో టీజర్ ను రిలీజ్ చేస్తాం. ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి. అలానే మ్యూజిక్ కూ చాలా ప్రాధాన్యం ఉంది. 'మోగ్లీ' ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ ఉండబోతున్నాయి. దీనిని కాలభైరవ అందిస్తున్నారు. ఈ మూవీతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అలానే బండి సరోజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ యేడాది చివరిలో మూవీని రిలీజ్ చేస్తాం'' అని చెప్పారు.
Latest News