|
|
by Suryaa Desk | Mon, Oct 13, 2025, 06:26 PM
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలకు సమయం ఆసన్నమవుతున్న వేళ, బాలీవుడ్లో పండగ సందడి వారం ముందే మొదలైంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా తన నివాసంలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్గా దీపావళి పార్టీని నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ తారాలోకమంతా కదిలి రావడంతో ఆయన ఇల్లు తారలతో కళకళలాడింది.ఈ పార్టీకి కరీనా కపూర్, కాజోల్, కృతి సనన్, సీనియర్ నటీమణులు రేఖ, హేమమాలిని వంటి స్టార్లతో పాటు నేటితరం తారలు అనన్య పాండే, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ వంటి వారు హాజరై సందడి చేశారు. వీరితో పాటు కరణ్ జోహార్, ప్రీతి జింటా, జెనీలియా, మలైకా అరోరా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి వంటి ఎందరో ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తారలంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయి, పార్టీకి కొత్త శోభను తీసుకొచ్చారు.
Latest News