|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 04:08 PM
మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్, టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ కలిసి 'క్రేజీ కళ్యాణం' అనే కొత్త సినిమాలో నటించనున్నారు. ఆరో సినిమాస్ బ్యానర్పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్నారు. 100% వినోదంతో కూడిన ఈ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ వీకే, అఖిల్ రాజ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News