|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 03:36 PM
గత 20 ఏళ్లుగా సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. కరోనా తర్వాత ఓటీటీల మార్కెట్ పెరగడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలు కూడా తమ సబ్స్క్రిప్షన్ ఫీజులను 5% నుండి 25% వరకు పెంచే యోచనలో ఉన్నాయి. ఓటీటీల ధరలు పెరిగితే, సామాన్యులు వినోదానికి దూరమయ్యే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు మూడు ఏళ్లలో ఈ ధరల పెరుగుదల ఉండవచ్చని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Latest News