|
|
by Suryaa Desk | Mon, Oct 13, 2025, 06:09 PM
బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. వారంవారం కొంతమంది ఎలిమినేట్ అయి హౌస్ లో నుంచి బయటకు రాగా ఆదివారం వైల్డ్ కార్డ్ తో ఆరుగురు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష కూడా ఉండడం విశేషం. మిగతా వారిలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, సీరియల్ నటీనటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా ఉన్నారు. కొత్త కంటెస్టెంట్స్ రాక తో బిగ్ బాస్ హౌస్ రణరంగంగా మారింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క రోజులోనే దివ్వెల మాధురి కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేసిన ప్రోమోలో దివ్వెల మాధురి హౌస్ లోని కంటెస్టెంట్లతో గొడవపడి కంటతడి పెట్టడం కనిపించింది.
Latest News