|
|
by Suryaa Desk | Sat, Sep 27, 2025, 02:55 PM
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం ‘దేవర’. గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించినా, దానిపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ, చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా 'దేవర 2' పై ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. 'దేవర' మొదటి భాగం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకుంది. "దేవర తాండవానికి ఏడాది పూర్తయింది. దేవర 2 కోసం సిద్ధంకండి" అంటూ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటనను కూడా విడుదల చేసింది.
Latest News