|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 03:52 PM
కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు కుకునూరుపల్లి రైల్వే బ్రిడ్జిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 10 మంది గాయపడ్డారు. వారిలో డ్రైవర్, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బస్సులో ఉన్నవారు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం గజ్వేల్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.