|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 03:47 PM
చొప్పదండి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్, గిఫ్ట్ ఆర్టికల్స్ మరియు జనరల్ స్టోర్స్ లో ఫోటో ఫ్రేమ్స్ అమ్మడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటుందని ఆరోపిస్తూ శనివారం ఎస్ఐ నరేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తక్కువ ధరకు నాసిరకం ఫ్రేములు అమ్ముతూ తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారని, వారిని ఫోటో ఫ్రేమ్స్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు బొడిగె అజయ్, సామల కిషోర్, సభ్యులు విజ్ఞప్తి చేశారు.