|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 10:32 AM
TG: భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం గారు చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.