|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 02:31 PM
సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం శనివారం ఉపాధిహామీ కూలీలకు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు. నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామ శివారులో ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు కూలీలు భారీగా తరలిరావాలని బలరాం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.