![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:47 PM
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య తెలిపారు.
ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. అలాగే, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల ప్రారంభానికి ఐదు నిమిషాల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష హాల్లోకి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్టికెట్లు, అవసరమైన డాక్యుమెంట్లను తీసుకెళ్లాలని సూచించారు.
బోర్డు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, అన్ని కేంద్రాల్లో సాఫీగా పరీక్షలు జరిగేలా పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పరీక్షల సమయంలో నిబంధనలను పాటించాలని బోర్డు కోరింది.