![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:41 AM
టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో జాపనీస్ నటుడు కాజుకి కీటమురా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా యొక్క షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామా యొక్క షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News