|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 03:40 PM
తమిళంలో బ్లాక్ కామెడీ జోనర్లో రూపొందిన సినిమానే 'జాలీ ఓ జింఖానా'. రాజేంద్ర రాజన్ - పునీత రాజన్ నిర్మించిన ఈ సినిమాకి, శక్తి చిదంబరం దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది నవంబర్ 22వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. ప్రభుదేవా - మడోన్నా సెబాస్టీయన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: తంగసామి (వైజీ మహేంద్రన్) కొత్తగా ఓ హోటల్ పెడతాడు. కూతురు చెల్లమ్మ (అభిరామి) .. మనవరాళ్లు భవాని (మడోనా సెబాస్టియన్) శివాని - యాళిని ప్రోత్సహించడంతోనే అతను ఆ నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్లంతా ఆ హోటల్లో తినేసి రెండు లక్షలకు పైగా బిల్ చేస్తారు. వాళ్లంతా లోకల్ ఎమ్మెల్యే రాజు (మధుసూదన్) మనుషులు. బిల్ విషయంలో అతనితో తంగసామి గొడవపడతాడు. ఫలితంగా వాళ్లతో తన్నులు తినేసి హాస్పిటల్ పాలవుతాడు. అతన్ని బ్రతికించుకోవడానికి 25 లక్షలు అవసరవుతాయి.ఆ డబ్బు కోసం భవాని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమె ఎకౌంటులో 25 లక్షలు పడతాయి. తాను అప్పు అడిగిన రాకెట్ రవి ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ చేసి ఉంటాడని భావిస్తుంది. వెంటనే ఆ మొత్తాన్ని హాస్పిటల్ కి కట్టేసి తాతయ్యను కాపాడుకుంటుంది. అప్పుడు ఆమెను బొట్టు భవాని (సాయి దీనా) అనే లోకల్ రౌడీ వచ్చి కలుస్తాడు. ఎమ్మెల్యే రాజు మనుషులు తనకి పంపించవల్సిన డబ్బును పొరపాటున ఆమెకు పంపించినట్టుగా చెబుతాడు. వెంటనే ఆ మొత్తం తన అకౌంటుకు బదిలీ చేయమని బెదిరిస్తాడు. భవాని ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులతో చెబుతుంది. 25 లక్షలు ఇవ్వకపోతే బొట్టు భవాని తమని బ్రతకనివ్వడని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో తమని కాపాడేది లాయర్ పూంగు (ప్రభుదేవా) మాత్రమేనని భావిస్తారు. సిటీలోని ఒక హోటల్లో బస చేసిన ఆయనను కలుసుకోవడానికి అంతా కలిసి వెళతారు. అక్కడ అతని డెడ్ బాడీ చూసి షాక్ అవుతారు. ఆ సమయంలోనే అతనికి సంబంధించిన 10 కోట్ల విషయం వాళ్లకి తెలుస్తుంది. పూంగును హత్య చేసినదెవరు? ఆ నేరం తమపై పడకుండా వాళ్లు ఏం ప్లాన్ చేస్తారు? ఎమ్మెల్యే మనుషుల నుంచి తప్పించుకోగలుతారా? అనేది కథ.
Latest News