|
|
by Suryaa Desk | Tue, May 13, 2025, 06:18 PM
'హనుమాన్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా సాధించిన విజయంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్ష్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తామని తెలిపాడు. కేవలం తన దర్శకత్వంలోనే కాకుండా ఇతరుల దర్శకత్వంలోనూ ఈ యూనివర్స్ లో సినిమాలు ఉంటాయని చెప్పాడు. ఇప్పటికే 'జై హనుమాన్' ను స్వీయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. అలానే పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఆర్.కె.డి. స్టూడియ్స్ రివాజ్ రమేశ్ దుగ్గల్ తో కలిసి 'మహా కాళీ' మూవీని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మే 12న నిరాడంబరంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలిపారు. దీనికి నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో పాటు ప్రశాంత్ వర్మ కథ, కథనం అందిస్తున్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో మిళితమై ఈ సినిమా ఉండబోతోంది. ఇది భారతదేశంలోనే ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో, యూనివర్స్ లో మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో మూవీ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
Latest News