|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 02:41 PM
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల టీఎస్ యుటిఎఫ్ నాయకులు సీపీఎప్ రద్దు కోసం మరియు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేశారు. ఈ ధర్నాలో గండ్వీడ్ మండల టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యక్షులు గోవింద్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏవిధంగా ఉద్యోగులను మోసం చేశాయో, అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని శనివారం అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల, మండలాల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.