![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 02:58 PM
జగిత్యాల విద్యానగర్ మైసమ్మగడ్డ కాలనీ వాసులు ఆదివారం గ్రామ దేవతలైన పోచమ్మకు బోనాలు సమర్పించారు. మహిళలు పాడి పంట, కుటుంబాలను చల్లగా చూడాలని, సమృద్ధిగా వర్షాలు కురువాలని, సమాజం ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాండ్ర సురేందర్, కటారి చంద్రశేఖర్ రావు, ఎన్నం నర్సింహా రెడ్డి, మోటల కృష్ణ, రాజేందర్, మల్లారెడ్డి, ఎన్నం కిషన్ రెడ్డి, సత్యం పంతులు, కాశెట్టి తిరుపతి పాల్గొన్నారు.