దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 01:28 PM
జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ పేటలో గల శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం గణపతి, ధ్వజస్తంభ, నవగ్రహ ప్రతిష్ట మరియు గర్భలయం రాజగోపురంపై కళశ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.