![]() |
![]() |
by Suryaa Desk | Tue, May 20, 2025, 08:49 PM
తెలంగాణలో భూ సమస్యల శాశ్వత పరిస్కారానికి కొత్తగా భూభారతి చట్టం తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి భూముల సర్వేలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి రెవిన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని.. అందుకోసం 6 వేల మంది సర్వేయార్లను కొత్తగా నియమిస్తున్నట్లు వివరించారు.పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామంలో భూ భారతి రెవిన్యూ అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.అలాగే 6000 మంది లైసెన్స్ సర్వేయర్లను ఈనెల 27వ తేదీ ఫైనల్ చేస్తామని తెలిపారు.3 నెలలు వారికి శిక్షణ ఇచ్చి ప్రతి మండలానికి 8 మంది తగ్గకుండా సర్వేయర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లు 4 లక్షల 50 వేలు ఇప్పటికే ప్రకటించడం జరిగిందని ఈ నెలాఖరులోపు లబ్ధిదారులను ప్రకటిస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9872 మంది చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నట్లు పేర్కొన్నారు.