|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:43 PM
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా 200కు పైగా దేవాలయాలను సొంత నిధులతో నిర్మించడంతోపాటు పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేస్తున్నారు.తాజాగా.. జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని జీవి గుట్ట కాలనీలో నూతనంగా నిర్మించిన రాధాకృష్ణ దేవాలయం రాజగోపురం నిర్మాణానికి 27 లక్షల భారీ విరాళం అందించారు. ఆదివారం ఉదయం స్థానిక ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి రాజగోపురాన్ని ఆయన ప్రారంభించారు. భవిష్యత్తులోనూ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, మాజీ కౌన్సిలర్ బాశెట్టి కృష్ణ, నరసింహారెడ్డి, సత్యనారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.