|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 11:50 AM
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అనారోగ్యంతో మృతి . అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరి.. పీజీ పూర్తి చేసి, పార్ట్ టైం వర్క్ చేస్తున్న ప్రియాంక . దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు . అయితే స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించిన వైద్యులు