|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 05:33 PM
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, ప్రముఖ కొరియోగ్రాఫర్-దర్శకురాలు ఫరా ఖాన్ మధ్య ఉన్న దశాబ్దాల స్నేహానికి బీటలు వారినట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు చేసుకున్న ఓ చిన్నపాటి వ్యాఖ్య ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీయగా, ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వీరిద్దరి మధ్య ఇంతకాలం ఉన్న అనుబంధం ఒక్కసారిగా ఎందుకు దెబ్బతిన్నదనే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.వివరాల్లోకి వెళితే, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫరా ఖాన్, దీపికా పదుకొణె పనివేళలపై సరదాగా స్పందించారు. "ఆమె ఇప్పుడు రోజుకు కేవలం 8 గంటలే పని చేస్తోంది. అలాంటిది ఈ షోకు రావడానికి ఆమెకు సమయం ఎక్కడుంటుంది?" అని ఫరా ఖాన్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అయితే, సరదాకు చేసిన ఈ కామెంట్లు దీపికకు నచ్చలేదని సమాచారం. ఈ వ్యాఖ్యల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.ఈ పరిణామం తర్వాత దీపికా పదుకొణె వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫరా ఖాన్ను అన్ఫాలో చేశారు. ఇది గమనించిన ఫరా ఖాన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆమె దీపికతో పాటు, ఆమె భర్త, నటుడు రణ్వీర్ సింగ్ను కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి అన్ఫాలో చేశారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
Latest News