|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 07:51 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో, నవంబర్ 11వ తేదీన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. సెలవు రోజులు మినహా మిగిలిన పనిదినాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. కార్యాలయంలో నేరుగా లేదా డిజిటల్ విధానంలో దాఖలు చేసే అవకాశం ఉంది.