![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 11:18 AM
గురువారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ముస్లిం మత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం, మరియు హిందూ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో, దీనికి నిరసనగా శుక్రవారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒవైసీ వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, సామాజిక సౌహార్దానికి భంగం కలిగించేలా ఉన్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.