![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 01:06 PM
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్కనబోయిన గోవింద్ యాదవ్ గారిని పరామర్శించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. నేరేడుగొమ్ము మండలానికి చెందిన కాసరాజుపల్లి గ్రామానికి చెందిన శ్రీ అక్కనబోయిన గోవింద్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని BN రెడ్డి లైఫ్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు నేడు హైదరాబాద్కు వెళ్లి BN రెడ్డి లైఫ్ కేర్ ఆసుపత్రిలో గోవింద్ యాదవ్ గారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యాధికారులకు సూచించారు.ఈ సందర్బంగా చందంపేట మాజీ ఎంపీపీ శ్రీ ఏడ్పుల గోవింద్ యాదవ్, దేవరకొండ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముకురోజు రాజు తదితరులు కూడా ఎమ్మెల్యే గారితో కలిసి పాల్గొన్నారు.