|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 09:28 AM
జాతిరత్నాలు ఫేమ్ కెవి.అనుదీప్ దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు మాస్ క దాస్ విశ్వక్ సేన్ ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫంకీ' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రంలో కాయాడు లోహర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో నరేష్, మురళీధర్ గౌడ్, సంపత్ రాజ్, ఈశ్వరి రావు, విజయ్ కృష్ణ, గణేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా భారీ స్పందనను అందుకుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ని మూవీ మేకర్స్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఫంకీకి సంగీతం జిబ్రాన్ మరియు తనిష్క్ బాగ్చి అందించారు మరియు సినిమాటోగ్రఫీని రిచర్డ్ కె ప్రసాద్ నిర్వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తుంది.
Latest News