|
|
by Suryaa Desk | Fri, Aug 01, 2025, 08:04 PM
పటాన్చెరు : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీకి చెందిన బిక్షపతి గత కొంతకాలంగా అనారోగ్యంలో బాధపడుతున్నారు. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. చికిత్స నిమిత్తం రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు అయింది. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిక్షపతి కుటుంబ సభ్యులకు ఎల్ఓసి అనుమతి పత్రాలను ఎమ్మెల్యే జిఎంఆర్ అందజేశారు.