![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:39 PM
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకరపల్లి చంద్రశేఖర్, మండల విద్యాధికారి ఆర్. పద్మయ్య ఆధ్వర్యంలో కీ. శే చింతలపల్లి మల్లారెడ్డి, శాంతమ్మల జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులందరికీ సుమారు 20 వేల రూపాయల విలువగల స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకొని, చదువుకున్న పాఠశాలపై అభిమానంతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.