![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 12:21 PM
కొల్లాపూర్ పట్టణంలో టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా నేత రామచంద్రం మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం నిరాహార దీక్ష చేస్తుంటే కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.