![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:56 PM
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) పరామర్శించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులనుద్దేశించి వివరాలను తెలుసుకున్నారు.
కేటీఆర్, గోపీనాథ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, రవీందర్ రావు, కవిత మాలోతు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.