|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 01:40 PM
TG: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్రెడ్డి (26) లండన్లో గుండెపోటుతో మృతి చెందారు. మహేందర్ రెండు సంవత్సరాల క్రితం పీజీ చేసేందుకు లండన్ వెళ్లి ఇటీవలే పూర్తి చేశారు. వర్క్ వీసా కూడా పొందాడు. మహేందర్ తండ్రి రమేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా ఉన్నారు. మహేందర్ మృతి పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.