![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 03:30 PM
రామచంద్రాపురం : పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు అనునిత్యం తన దైవభక్తిని చాటుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ నూతన దేవాలయం నిర్మాణం జరిగిన విరాళాలు అందిస్తూ ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. తాజాగా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని కాకతీయ నగర్ కాలనీలో గల సీతారామ దాసంజేనేయ స్వామి దేవాలయంలో “శ్రీ భవానీ కోటి పార్థవ పంచ ముఖ లింగేశ్వర స్వామి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై.. ఆలయ అభివృద్ధికి ఐదు లక్షల రూపాయల విరాళం అందించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరైన తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని కలిసి.. ఆశీర్వాచనాలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లోనూ ఆలయ అభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు.