![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 07:39 PM
నగరంలోని ధూల్పేట్ బలరాంగల్లీ ప్రాంతంలో బుధవారం ఎస్టిఎఫ్ ఏ టీమ్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 1.144 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఉమేష్ సింగ్, అరుణ బాయి, గోపాల్ సింగ్ అనే ముగ్గురిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసినట్టు ఎస్టిఎఫ్ టీమ్ లీడర్ అంజి రెడ్డి మీడియాకు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు, వారి వద్ద పట్టుబడిన గంజాయిని ధూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
గంజాయి సరఫరా, నిల్వలపై నిఘా పెంచినట్టు అధికారులు తెలిపారు. ఇలాంటి దాడులు మున్ముందు కూడా కొనసాగుతాయని వెల్లడించారు.