![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:39 PM
బాన్సువాడ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగు విత్తనాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొని రైతులకు విత్తనాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు, నాణ్యమైన విత్తనాలు సమయానికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నార్ల సురేష్ గుప్తా, జంగం గంగాధర్, నార్ల రవీందర్ గుప్తా, మోహన్ నాయక్, ఎజాస్, లింగమేశ్వర్, రేంజర్ల సాయిలు, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సబ్సిడీ విత్తనాల పంపిణీ ద్వారా రైతులకు మంచి ఆదాయం అందే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.