![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:58 PM
టెక్నాలజీ సేవల సంస్థ యాక్సెంచర్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 మంది ఉద్యోగులకు జూన్ నెలలో పదోన్నతులు కల్పించనున్నట్లు ప్రకటించింది. బలహీనమైన కన్సల్టింగ్ సేవల డిమాండ్ కారణంగా గత ఏడాది డిసెంబర్లో వాయిదా వేసిన ప్రమోషన్ల ప్రక్రియను ఇప్పుడు చేపట్టడం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, యాక్సెంచర్ ఈ మేరకు తమ సిబ్బందికి ఒక అంతర్గత మెమో పంపింది. డబ్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,01,000 మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో సుమారు 6 శాతం మంది ఈ ప్రమోషన్ల ద్వారా లబ్ధి పొందనున్నారు.ప్రాంతాల వారీగా చూస్తే, భారత్లో అత్యధికంగా 15,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా (EMEA) రీజియన్లో 11,000 మందికి, అమెరికాస్ రీజియన్లో 10,000 మందికి ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తన మెమోలో పేర్కొంది.