రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 10:33 AM
TG:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన సరస్వతి(22) ఈ నెల 4న HYD మీర్ పేట పీఎస్ పరిధిలోని ఓ హాస్టల్లో ఉరేసుకుని మృతి చెందింది. సరస్వతి, తన గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని ఆమె కోరగా అతను నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెంది తమ కూతురు మృతి చెందిందని, ఇందుకు ప్రేమించిన యువకుడే కారణమని ఆరోపిస్తూ మంగళవారం ఆ యువకుడి ఇంటి ఎదుట మృతదేహంతో యువతి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.